BJPలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-12T00:44:15+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

BJPలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) చెప్పారు. తాండూరులో కాంగ్రెస్‌ (Congress‌) బలంగా ఉన్నప్పటికీ.. అక్కడ సమర్ధవంతుడైన నాయకుడు లేడని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ (TRS) మాత్రం బలహీనపడిందని ఆయన తెలిపారు. బీజేపీ కూడా బలపడుతున్నప్పటికీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నందున.. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయంలో తొందర పడటం లేదన్నారు. ఇప్పటికీ తాను స్వతంత్రంగా ఉన్నానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Read more