అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకుంది: vijayashanthi
ABN , First Publish Date - 2022-05-12T01:43:29+05:30 IST
అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకుంది: vijayashanthi
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు vijayashanthi విమర్శలు గుప్పించారు. KCR సర్కార్ పేరుకు మాత్రం ప్రజా ప్రభుత్వమని చెప్పుకోవడం... చేసేది మాత్రం ప్రజలను దోచుకోవడమే అని ఆమె ఆరోపించారు. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ పనిగా పెట్టుకుందని, గత ప్రభుత్వం పేదలకు.. ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''కేసీఆర్ సర్కార్ పేరుకు మాత్రం ప్రజా ప్రభుత్వమని చెప్పుకోవడం... చేసేది మాత్రం ప్రజలను దోచుకోవడం. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ పనిగా పెట్టుకుంది. గత ప్రభుత్వం పేదలకు... ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అయితే జీవనోపాధిని కొనసాగించాలని... అమ్ముకోవడానికి వీల్లేదని చిన్న క్లాజు పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసైన్డ్ భూములపై దృష్టిపెట్టి వాటిని లాక్కోవడమే పనిగా పెట్టుకున్నడు. ఇందులో ప్రభుత్వ అధికారుల ముఖ్య పాత్ర ఉంది. అన్ని జిల్లాల్లో నిషేధిత భూమిని ప్రభుత్వ అధికారులే తెల్లకాగితాలపై రాయించుకుంటున్నరు. బెదిరించి, నిషేధిత జాబితాలో ఉన్నయని భయపెట్టి... బెదిరించి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో భూములు కొనేశారు. బ్లాక్ మెయిల్ చేసి అసైన్డ్ భూములు లాక్కుని... వాటితో వేరే రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 90 శాతం భూమి రైతుల వద్ద లేదు. అంతా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆక్రమణలోనే ఉన్నాయి. కేసీఆర్... నీ అక్రమాలు ఎంతో కాలం సాగవు. తొందర్లోనే నీ సర్కార్కు, నీ కారుకు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెబుతుంది.'' అని విజయశాంతి అన్నారు.
Read more