Raj bhavan రాజ్ భవన్ వద్ద మీడియాపాయింట్ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-05-08T21:58:05+05:30 IST

రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ లేక పోవడంతో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు.

Raj bhavan రాజ్ భవన్ వద్ద మీడియాపాయింట్ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్: రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ లేక పోవడంతో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ (tamilisy) ను కలసిన పలువురు జర్నలిస్టులు(journalists) తాము ఎదుర్కొంటోన్న సమస్యలపై గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని గవర్నర్ ను వారు కోరారు.రాజ్ భవన్ బయట రోడ్ పైన వార్తలను కవర్ చేస్తోన్న విషయాన్ని గవర్నర్ కు జర్నలిస్టులు వివరించారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మీడియా పాయింట్ తో పాటు‌..మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించినందుకు గవర్నర్ కు జర్నలిస్టులు ధన్యవాదములు తెలిపారు. 

Read more