ఏపీ, తెలంగాణ ప్రజలకు జియో శుభవార్త.. మరో 71 పట్టణాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ

ABN , First Publish Date - 2022-05-13T00:36:15+05:30 IST

దేశంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తునన జియో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో

ఏపీ, తెలంగాణ ప్రజలకు జియో శుభవార్త.. మరో  71 పట్టణాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ

హైదరాబాద్:  దేశంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తునన జియో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకుంటోంది. సేవల విస్తరణలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన 71 నగరాలు, పట్టణాలకు జియో ఫైబర్ చేరుకుంది. జియో సేవలు ఇప్పుడు విజయవాడ, విశాఖపట్టణం వంటి ముఖ్య నగరాలతోపాటు  అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, ఉయ్యూరు వంటి 43 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి.


అలాగే, తెలంగాణలో 28 నగరాలు, పట్టణాల్లో జియో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్‌లలో ఇప్పుడు జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తున్నాయి. త్వరలోనే మరో ఏడు పట్టణాలకు సేవలను విస్తరించనున్నట్టు జియో తెలిపింది. 


ప్రస్తుతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఎంతో డిమాండ్ ఉంది. వర్క్‌ఫ్రమ్ పెరగడం, చిన్నచిన్న సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు డిజిటల్ విధానంలో సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జియో తన సేవలు విస్తరించడం వల్ల ఇలాంటి వారిందరికీ ప్రయోజనం చేకూరనుంది. 

 

అలాగే, జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు మరో ప్లాన్ కూడా ప్రకటించింది.  ఇప్పుడు వారు ఎలాంటి రుసుము లేకుండానే జియో ఫైబర్‌ను ఎంచుకోవచ్చు. వీరికి రూ. 10 వేల విలువైన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్‌టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్ ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు జియో ఫైబర్ ఎంటైర్‌టైన్‌మెంట్ బొనాంజా ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది అదనంగా చెల్లించే రూ.100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399  ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ పొందొచ్చు. నెలకు రూ.100 లేదంటే రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్‌ను చూడవచ్చు. 

Read more