-
-
Home » Andhra Pradesh » Jawahar comments-MRGS-AndhraPradesh
-
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డునపడింది: Jawahar
ABN , First Publish Date - 2022-05-03T21:18:15+05:30 IST
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడిందని జవహర్ ఆరోపించారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టెన్త్ పరీక్ష పత్రాల లీక్, మాస్ కాపీయింగ్ ఘటనలతో.. ప్రభుత్వం నాడు-నేడుకు కొత్త నిర్వచనం చెప్పిందన్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడ్డ జగన్.. ఇది పెద్దనేరం కాదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఈ ఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.