-
-
Home » Andhra Pradesh » janasena leader nadendla manohar andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
వైసీపీ ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు...జగన్లో ఆందోళన మొదలు: నాదెండ్ల
ABN , First Publish Date - 2022-05-14T15:33:52+05:30 IST
నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సి.బి.ఐ. దత్తపుత్రుడుకి తెలిసిన విద్య అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
అమరావతి: నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సి.బి.ఐ. దత్తపుత్రుడుకి తెలిసిన విద్య అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్ష లు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారని మండిపడ్డారు. సి.పి.ఎస్. రద్దుపై మాట తప్పారన్నారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకు లేదని అన్నారు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని నిలదీశారు. గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు. పరిపాలన చేతగాని సి.బి.ఐ.దత్తపుత్రుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని నాదెండ్ల మనోహర్ అన్నారు.