బాలికను కరిచిన pet Dog...సొసైటీకి వినియోగదారుల ఫోరం షాక్

ABN , First Publish Date - 2022-05-11T18:07:38+05:30 IST

సొసైటీలో పెంపుడు కుక్క బాలికను కరిచిన ఘటనలో వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది...fi

బాలికను కరిచిన pet Dog...సొసైటీకి వినియోగదారుల ఫోరం షాక్

రూ.4లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశం

గురుగ్రామ్: సొసైటీలో పెంపుడు కుక్క బాలికను కరిచిన ఘటనలో వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది.ఫిర్యాదుదారు తన కుటుంబంతో కలిసి డీఎల్ఎఫ్ సిటీలోని ది మాగ్నోలియాస్‌లో అద్దెకు ఉంటున్నారు.‘‘అద్దె ఒప్పందం ప్రకారం నేను నెలకు రూ.3 లక్షలు అద్దెగా, మరో లక్షరూపాయలను మెయింటెనెన్స్ ఛార్జీగా చెల్లించాను. 2020 ఫిబ్రవరి నెలలో నా కుమార్తె శివి తన మామను కలవడానికి 22వ అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్‌లోకి ఎక్కింది. 10వ అంతస్తులో నిందితుల్లో ఒకరైన రాకేష్ కపూర్ సేవకుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు.కుక్కను బంధించలేదు. దీంతో అది నా కూతురిపైకి దూకి ఆమెను కొరికి గాయపరిచింది. ఆ పనిమనిషి నా బిడ్డను అక్కడే వదిలేసి పెంపుడు కుక్కతో వెళ్లిపోయింది. నా కూతురిని హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. కుక్క కరవడం వల్ల నా కూతురు రెండు సంవత్సరాలు పాఠశాలకు వెళ్లలేకపోయింది.’’అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


వాదనలు విన్న వినియోగదారుల కోర్టు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి, బాధితురాలికి రూ.3.80 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.సోసైటీ నివాసి కుక్క కాటుకు సంబంధించిన కేసులో గురుగ్రామ్‌లోని గేటెడ్ హౌసింగ్ సొసైటీ, దాని సెక్యూరిటీ ఏజెన్సీకి జిల్లా వినియోగదారుల ఫోరం రూ.4 లక్షల జరిమానా విధించింది.బాధితురాలికి, బాలికకు మరియు ఆమె కుటుంబానికి మానసిక వేదన కలిగించిన సేవలో లోపం కారణంగా మాగ్నోలియాస్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ ఏజెన్సీకి జరిమానా విధించినట్లు సంజీవ్ జిందాల్ కోర్టు పేర్కొంది.కేసును కోర్టులో ప్రవేశపెట్టిన తేదీ నుంచి అదనంగా 9 శాతం వడ్డీని, బాధితురాలికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించడానికి రూ. 20వేలు చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని సొసైటీ ప్రెసిడెంట్, ఎస్టేట్ మేనేజర్, సెక్రటరీతో సహా యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.




Read more