Asani Cyclone ఎఫెక్ట్.. విమానాల రద్దు
ABN , First Publish Date - 2022-05-12T15:10:23+05:30 IST
అసాని తుఫాన్ ప్రభావంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం...
హైదరాబాద్ సిటీ/శంషాబాద్ : అసాని తుఫాన్ ప్రభావంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, విజయవాడ వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్పోర్టు అధికారులు బుధవారం పేర్కొన్నారు. ఇండిగో, స్సైస్జెట్, ఎయిర్ ఇండియా విమాన సర్వీలు రద్దయ్యాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం నుంచి రావాల్సిన విమాన సర్వీసులూ రద్దయ్యాయని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. బుధవారం 9 విమానలు రద్దయినట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తరువాతే విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తామని ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు.