తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలు
ABN , First Publish Date - 2022-05-14T06:51:49+05:30 IST
భక్తితో మొక్కులు తీర్చుకుని విందారగిద్దామనుకొని వచ్చినవారికి వారికి ఆనందం ఆవిరైంది. తేనెటీగల దాడికి గురయ్యారు.
నిజామాబాద్ రూరల్, మే 13: భక్తితో మొక్కులు తీర్చుకుని విందారగిద్దామనుకొని వచ్చినవారికి వారికి ఆనందం ఆవిరైంది. తేనెటీగల దాడికి గురయ్యారు. రూరల్ మండలం చక్రధర్నగర్లోని గొల్లగుట్ట సమీపంలో దర్గా ఉంది. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లింగి శివాజీ బంధుమిత్రులతో కలిసి ఖుషీ పండుగ చేసుకునేందకు దర్గాకు వచ్చారు. ఉదయం దాదాపు 40 మంది బంధు మిత్రులతోకలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వంటలకు ఏర్పాట్లు చేసుకుంటుండా పొగకు చెట్టుపై ఉన్న తేనె టీగలు లేచాయి. ఒక్కసారిగా అక్కడున్నవాఆరిపై దాడి చేశాయి. దీంతో అందరూ హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరిలో 10 మంది పెద్దవారికి, ఐదుగురు చిన్నపిల్లలను సైతం తేనెటీగలు కుట్టాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.