బొగ్గులవాగు ప్రాజెక్టులో మృతదేహం (Dead body)
ABN , First Publish Date - 2022-05-13T18:21:03+05:30 IST
మండల పరిధి ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని బొగ్గులవాగు ప్రాజెక్టులో ఓ మృతదేహం కనిపించింది. ఎడ్లపల్లి గ్రామానికి చెందిన మత్సకారులు ఉదయం చేపలు
- తలకు, కాళ్లకు బండరాళ్లు కట్టిన ఆనవాళ్లు
మల్హర్ (జయశంకర్ భూపలపల్లి): మండల పరిధి ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని బొగ్గులవాగు ప్రాజెక్టులో ఓ మృతదేహం కనిపించింది. ఎడ్లపల్లి గ్రామానికి చెందిన మత్సకారులు ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లగా.. ప్రాజెక్టులో తేలాడుతున్న శవం కనిపించింది. దీంతో వారు వెంటనే కొయ్యూర్ పోలీసులకు సమాచారం అందించారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్రావు, ఎస్సై-2 ప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎవరో హత్య చేసి తలకు, కాళ్లకు బండరాళ్లు కట్టి ప్రాజెక్టులో వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాలుగైదు రోజులు కావడం వల్ల మృతదేహం కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో ఉందన్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు 5.6 ఉంటాడని, ఒంటిపై పసుపు రంగు హాఫ్ హ్యాండ్ జెడ్ బ్రాండ్ షర్ట్ ఉన్నాయని వివరించారు. మృతదేహాన్ని గుర్తించిన వారు కొయ్యూర్, కాటారం పోలీసులను సంప్రదించాలని కోరారు. ఎడ్లపల్లి వీఆర్వో సంగీత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు చెప్పారు.