టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు ఖరీదైన స్థలం కేటాయింపుపై రేవంత్ విమర్శ
ABN , First Publish Date - 2022-05-13T17:33:41+05:30 IST
టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఖరీదైన స్థలం కేటాయింపుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది… ఎవని పాలయిందిరో తెలంగాణ… జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.