సకాలంలో నాణ్యమైన బొగ్గును రవాణా చేయాలి
ABN , First Publish Date - 2022-05-15T05:24:12+05:30 IST
వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో రవాణా చేయాలని ఏరియా అధికారులకు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ సూచించారు.
సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్
మణుగూరుటౌన్, మే 14: వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో రవాణా చేయాలని ఏరియా అధికారులకు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ సూచించారు. ఏరియా అధికారులతో కలసి శనివారం ఆయన మణుగూరులో పర్యటించారు. ఇందులో భాగంగా ఓసీ గనులను, కేసీహెచ్పీని సందర్శించారు. కేసీహెచ్పీలో నిర్మిస్తున్న ఆరువేల టన్నుల సామర్థ్యంగల బంకర్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు, అధికా రులకు సూచించారు. దీంతో పాటు కేసీహెచ్పీలో జరుగుతున్న వ్యాగన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించి నాణ్యమైన బొగ్గు రవాణ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూ సకాలంలో రవాణా చేయాలన్నారు. అనంతరం పీకేవోసీ గనిని సందర్శించి ఓసీ-2 విస్తరణ పనులు పరిశీలించారు. మణుగూరు ఓసీ గని వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తొలి ప్రాధాన్యతనిస్తూ సింగరేణి ఆధారపడిన పరిశ్రమ లకు ఏక కాలంలో బొగ్గు రవాణా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందుస్తుగానే వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని, కాలువల నిర్మాణ పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం లలిత్కుమార్, కేపీయూజీ ఏజెంట్ నాగేశ్వరరావు, ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, మణుగూరు ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీని వాసాచారి, పీకేవోసీ ప్రాజెక్ట్ మేనేజర్ రాముడు, పీకేఓసీ-2 మేనేజర్ రాంబాబు, మణుగూరు ఓసీ మేనేజర్ నర్సింహాస్వామి, డీజీఎం కేసీహెచ్పీ సురేష్, సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బీరుద్దీన్ పాల్గొన్నారు.