బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల CM KCR సంతాపం
ABN , First Publish Date - 2022-05-06T22:45:45+05:30 IST
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల CM KCR సంతాపం
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తన సహచరుడు, ఆత్మీయుడిని కోల్పోయానని కేసీఆర్ అన్నారు.
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు.
తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.