గౌరవం దక్కకే.. ఐపీఎల్‌కు దూరం

ABN , First Publish Date - 2022-05-09T09:49:46+05:30 IST

తనకు సరైన గౌరవం లభించకనే ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉన్నట్టు క్రిస్‌ గేల్‌ వెల్లడించాడు.

గౌరవం దక్కకే.. ఐపీఎల్‌కు దూరం

లండన్‌: తనకు సరైన గౌరవం లభించకనే ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉన్నట్టు క్రిస్‌ గేల్‌ వెల్లడించాడు. తాను బాగా ఆడినా గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తన పట్ల సరిగ్గా వ్యవహరించలేదని చెప్పాడు. ఎన్నో సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెగా లీగ్‌లో తన ముద్ర వేసిన ఈ వెస్టిండియన్‌.. కోల్‌కతా, బెంగళూరుతోపాటు చివరిగా పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచిన 42ఏళ్ల గేల్‌.. ఫామ్‌ కోల్పోయి 2020, 2021లో పంజాబ్‌ తుది జట్టులో చోటు దక్కించుకొనేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. ‘కొన్నేళ్లుగా ఐపీఎల్‌ జట్లు నా స్థాయికి తగ్గ గౌరవ మర్యాదలు ఇవ్వలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో గేల్‌ అన్నాడు. అయితే వచ్చే ఏడాది వేలంలో పాల్గొంటానన్నాడు. 

Read more