కారు, బైక్ ఢీ: యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-14T06:52:20+05:30 IST
: మండల కేంద్రంలోని కొత్త బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొని యుత్కం రాకేష్గౌడ్(35) అనే యువకుడు మృతి చెందాడు.
నందిపేట, మే13: మండల కేంద్రంలోని కొత్త బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొని యుత్కం రాకేష్గౌడ్(35) అనే యువకుడు మృతి చెందాడు. నందిపేట మండలం నికాల్పూర్ గ్రామానికి చెందిన యుత్కం రాకేష్గౌడ్ హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం స్వగ్రామం రావడానికి బైక్పై బయలుదేరాడు. నందిపేట శివారులో కొత్త బైపాస్ రోడ్డులో కారు ఎదురుగా అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. తీవ్ర గాయాలైన రాకేష్నుచికిత్స నిమిత్తం 108వాహనంలో నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుడు రాకేష్ భార్య యుత్కం విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.మురళి తెలిపారు.