jagan పాలనలో అథఃపాతాళానికి రాష్ట్రం: Budda Venkanna

ABN , First Publish Date - 2022-05-05T03:20:14+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రం అథఃపాతాళానికి వెళ్లిపోయిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

jagan పాలనలో అథఃపాతాళానికి రాష్ట్రం: Budda Venkanna

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రం అథఃపాతాళానికి వెళ్లిపోయిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆయన బుధవారం ఆయన మీడియాతో రాష్ట్రాన్ని జగన్మోహన్‌రెడ్డి ఎలా నాశనం చేశారో స్వయంగా చూసేందుకు రావాలని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వారికున్న అనుభవంతో జగన్‌ను సరిదిద్దుతారని ఆశతోనే సీఎంలకు ఆహ్వానిస్తున్నామని వెంకన్న అన్నారు. రోజుకో మానభంగం, పూటకో హత్య, గంటకో దోపిడీతో రాష్ట్రం బిహార్‌ను మించిపోయిందన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు. ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని, అయితే జగన్‌ సొంత ఖజానా మాత్రం ఫుల్‌ అయ్యిందని ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ ఇంత ధనదాహం లేదన్నారు. జగన్‌కు డబ్బు ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజా బలం ఉందని బుద్దా వెంకన్న తెలిపారు.


Read more