వ్యభిచార గృహంపై దాడి..నిర్వాహకుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-11T16:32:21+05:30 IST
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై పంజాగుట్ట పోలీసులు సోమవారం దాడి చేశారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు
హైదరాబాద్/పంజాగుట్ట: విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై పంజాగుట్ట పోలీసులు సోమవారం దాడి చేశారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన వి.ఆనంద్ కుమార్ అలియాస్ పవన్ సోమాజిగూడ జాఫర్ అలీబాగ్లోని ఓ ప్లాజాలో ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి యువతులను నగరానికి పిలిపించి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా విటులను రప్పించేవాడు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఓ కానిస్టేబుల్ను డికాయిగా డబ్బులు ఇచ్చి లోపలికి పంపించారు. అతను ఇచ్చిన సిగ్నల్స్ మేరకు ఎస్ఆర్నగర్ డీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ విజయభాస్కర్రెడ్డి, భావన, సిబ్బంది ప్లాట్పై దాడి చేశారు. నిర్వాహకుడు ఆనంద్ కుమార్ను అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. ఆనంద్ వద్ద నుంచి రూ.2,300 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.