Bojjala Gopala Krishna Reddy మృతి బాధాకరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-06T22:08:39+05:30 IST

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గోపాలకృష్ణారెడ్డి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి..

Bojjala Gopala Krishna Reddy మృతి బాధాకరం: చంద్రబాబు

అమరావతి: మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గోపాలకృష్ణారెడ్డి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు చేశారని తెలిపారు. బొజ్జల మరణం టీడీపీకి తీరని లోటన్నారు. బొజ్జల మృతికి గవర్నర్‌ హరిచందన్‌ సంతాపం వ్యక్తం చేశారు.


మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్‌లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.

Read more