బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2022-05-10T06:02:00+05:30 IST
గాంధారి మండలంలోని పేట్ సంగెం గ్రామంలో ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తున్న వృద్ధురాలికి మాయమాటలు చెప్పి, భుంపల్లి శివారులోని కెనాల్ వద్దకు రాగానే దాడి చేసి ఆమెపై ఒంటిపై ఉన్న బంగారు పుస్తె లు, చేతివెండి కడియాలను దోచుకెళ్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
కామారెడ్డి, మే 9: గాంధారి మండలంలోని పేట్ సంగెం గ్రామంలో ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తున్న వృద్ధురాలికి మాయమాటలు చెప్పి, భుంపల్లి శివారులోని కెనాల్ వద్దకు రాగానే దాడి చేసి ఆమెపై ఒంటిపై ఉన్న బంగారు పుస్తె లు, చేతివెండి కడియాలను దోచుకెళ్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లింగంపేట్ మండలం బోనాల గ్రామానికి చెందిన బానోత్ రాజకుమార్ గత నెల 30న ఓ వృద్ధురాలు బస్సుకోసం వేచి చూస్తుండగా రాంపల్లి స్కూల్ తండా వద్ద దింపుతానని చెప్పి బంగారు ఆభరణాలు, వెండి కడియాలు దొంగిలించాడని తెలిపారు. ఎస్డీపీవో ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుండగా, పద్మాజీవాడి ఎక్స్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని బైక్పై వస్తు పోలీసు సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారించినట్లు తెలిపారు. నిందితుడు నేరం ఒప్పుకోగా అతని వద్ద నుంచి 90 తులాల వెండి, 1.1 తులాల బంగారు అభరణాలు, బైక్, సెల్ఫోన్, రూ.1,14,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎటువంటి నేరాలకు పాల్పడిన కోర్టులో హజరుపరిచి శిక్షపడేలా చేస్తామని తెలిపారు.