జమ్ముకాశ్మీర్‌లో విషాదం.. మంటల్లో దగ్ధమైన యాత్రికుల బస్సు.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-05-14T00:04:18+05:30 IST

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సులో మంటలు చెలరేగాయి.

జమ్ముకాశ్మీర్‌లో విషాదం.. మంటల్లో దగ్ధమైన యాత్రికుల బస్సు.. నలుగురు మృతి

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కట్రాకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు ఇంజన్ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వేగంగా బస్సు అంతటా వ్యాపించాయి. యాత్రికుల బస్సు జమ్ము నుంచి కట్రా వెళ్తుండగా కట్రాకు 1.5 కిలోమీటర్ల దూరంలోని ఖర్మాల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృత్యువాతపడ్డారు. వైద్య నిమిత్తం క్షతగాత్రులను కట్రా తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

Read more