నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతి
ABN, First Publish Date - 2022-05-07T17:40:11+05:30
జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతి చెందారు.
కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు లింగంపేట్ మండలం లోని ముంబాజి పేట గ్రామానికి చెందిన బోయినీ లింగవ్వ(38) కూతురు రీనా (7), మేనకోడలు సౌమిక (9) గా గుర్తించారు. ముంబాజి పేటకు చెందిన లింగవ్వ, మౌలాన్ ఖేడ్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ఆటలాడుతుండగా నీటిలో మునిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు.