ఓయూలో మరోసారి ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-05-03T17:21:29+05:30
ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతనే ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెట్టాలని టీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు.