ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ములుగు జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు

ABN, First Publish Date - 2022-05-03T15:38:54+05:30

జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపులకు పాల్పడుతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ములుగు: జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపులకు పాల్పడుతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఏటూరునాగారం శివారులోని దెయ్యాలవాగులో  ఇసుక వ్యాపారులు ఇసుక క్వారీని ఏర్పాటు చేశారు. గోదావరి వరద ముప్పు నుంచి గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను తవ్వి భారీ గుంతలు తీస్తున్నారు. ఇసుక తీయడం వల్ల గ్రామానికి ముంపు ఉందని ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పట్టా భూమిలో పర్మిషన్ పేరుతో అక్రమంగా నడివాగులో ఇసుక వ్యాపారులు ఇసుక తవ్వకాలు చేపట్టారు. వాగులో భారీ ఇసుక గుంతలతో కరకట్టకు ముప్పు పొంచి ఉందని క్వారీని నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ టీఎస్‌ఎమ్‌డీసీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!