Road accident: లారీని ఢీకొన్న ఆటో...ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-05-14T13:48:21+05:30 IST
జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
జోగులాంబ గద్వాల: జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని టాటా ఏస్ ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.