ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

TS News: టి.కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌గాంధీ మరోసారి వార్నింగ్‌

ABN, First Publish Date - 2022-05-07T22:03:31+05:30

కాంగ్రెస్‌ నేతలకు ఈ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీభవన్ కాంగ్రెస్ (Congress) నేతలతో ఆయన భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: టి.కాంగ్రెస్‌ నేతలకు ఈ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీభవన్ కాంగ్రెస్ (Congress) నేతలతో ఆయన భేటీ అయ్యారు. పనిచేయకపోతే సీనియర్‌ నేతలకైనా టికెట్‌ రాదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కూర్చున్న వారికి టికెట్‌ రాదని, జనం మధ్య ఉండి కష్టపడేవారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కొందరు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆక్షేపించారు. మీడియాతో ఏదిపడితే అది మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుందామన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్‌గాంధీ సూచించారు.


పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక బాగుపడింది సీఎం కేసీఆర్ (KCR) కుటుంబమేనని విమర్శించారు. భవిష్యత్‌లో ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవారితో పొత్తులు ఉండవన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ నష్టం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గర డబ్బు, అధికారం ఉందికానీ.. జనబలం లేదన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టీలో సమైక్యత అవసరమని రాహుల్‌ రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!