ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-05-05T18:34:06+05:30
ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ వైస్ ఛాన్స్లర్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వ్యవహరిస్తున్నాడని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఓయూ విసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.