ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అదృశ్యమైన బాలుడు మృతి

ABN, First Publish Date - 2022-05-12T05:51:05+05:30

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్‌ ఒడ్డెరకాలనీకి చెందిన టేకు విజయ్‌కుమార్‌(13) అనే బాలుడు ఐదు రోజుల క్రితం కనిపించ కుండా పోగా, బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానిక ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7న తనకు సైకిల్‌ కొనివ్వాలని తండ్రి సతీష్‌ వద్ద విజయ్‌కుమార్‌ మారం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రస్తు తానికి సైకిల్‌ కొనివ్వాలేదని, తర్వాత కొనిస్తానని కొడుకును సముదాయించాడు. ఈ విషయమై మారుమాట్లాడకుండా స్నేహితులతో ఆడుకుంటానని ఇంటి నుం చి బయటకు వెళ్లిన విజయ్‌కుమార్‌ తిరిగి ఇంటికి రాలేదు. తన కొడుకు కనిపిం చడంలేదని, ఈనెల 9న తండ్రి సతీష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ ఆచూకి గురించి చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకున్న బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం అదృశ్యమైన విజయ్‌కుమార్‌ది అని కుటుంబసభ్యులు నిర్దారించ డంతో ఎస్సై రాజశేఖర్‌ శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కమ్మర్‌పల్లి, మే11: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్‌ ఒడ్డెరకాలనీకి చెందిన టేకు విజయ్‌కుమార్‌(13) అనే బాలుడు ఐదు రోజుల క్రితం కనిపించ కుండా పోగా, బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానిక ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7న తనకు సైకిల్‌ కొనివ్వాలని తండ్రి సతీష్‌ వద్ద విజయ్‌కుమార్‌ మారం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రస్తు తానికి సైకిల్‌ కొనివ్వాలేదని, తర్వాత కొనిస్తానని కొడుకును సముదాయించాడు. ఈ విషయమై మారుమాట్లాడకుండా స్నేహితులతో ఆడుకుంటానని ఇంటి నుం చి బయటకు వెళ్లిన విజయ్‌కుమార్‌ తిరిగి ఇంటికి రాలేదు. తన కొడుకు కనిపిం చడంలేదని, ఈనెల 9న తండ్రి సతీష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ ఆచూకి గురించి చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకున్న బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం అదృశ్యమైన విజయ్‌కుమార్‌ది అని కుటుంబసభ్యులు నిర్దారించ డంతో ఎస్సై రాజశేఖర్‌ శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!