ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

ABN, First Publish Date - 2022-05-11T05:27:59+05:30

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంగళవారం పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


బాన్సువాడ/ పిట్లం మే 10 : ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంగళవారం పరామర్శించారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో పాటు, బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అంజవ్వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి ఓదార్చారు. తన ప్రగాఽఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉంటానని ఆయన ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం త్వరగా అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉండి ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని పథకాలు అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు వెంకట్‌రాం రెడ్డి, స్పీకర్‌ పీఏ భగవాన్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఎర్వాల కృష్ణారెడ్డి, రూరల్‌ సీఐ మురళి, తదితరులు ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!