ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మనఊరు-మనబడి కార్యక్రమానికి నిధుల కొరత లేదు- మంత్రులు సబితారెడ్డి,హరీశ్ రావు

ABN, First Publish Date - 2022-05-03T00:39:00+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన వూరు - మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు లు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన వూరు - మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు లు పిలుపునిచ్చారు. మన వూరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో  సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ కేఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు, ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి గంగాధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, మన వూరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. రూ. 30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణా కమిటీలకు అప్పగించామని వెల్లడించారు. రూ.30 లక్షల పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మనవూరు - మన బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అన్ని జిల్లాలకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేశామని అన్నారు.


విద్యా యజ్ఞంగా చేపట్టిన ఈ మన వూరు - మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనిఖీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏవిధంగా వుంది, పనుల తర్వాత ఏ విధంగా ఉందనేదానిపై ఫోటోలు తీయించాలని తెలిపారు. ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వతేదీ లోపు పరిపాలన సంబంధిత మంజూరి చేసి 15 నాటికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!