బీజేపీది మాటల ప్రభుత్వం: మంత్రి Harish rao
ABN , First Publish Date - 2022-05-10T15:49:13+05:30 IST
కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు(Harish rao) స్పష్టం చేశారు.
హనుమకొండ: కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు(Harish rao) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం టీటీడీ కల్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీది మాటల ప్రభుత్వమని విమర్శించారు. వరంగల్లో అద్భుతంగా హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పేదలు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్ళు ఇవ్వబోతున్నామని తెలిపారు. సంవత్సరంలోగా 24 అంతస్తులలో 2000 పడకల పెద్ద ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.