బండి సంజయ్ జూటా మనిషి: Errabelli
ABN, First Publish Date - 2022-05-03T18:13:15+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వరంగల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ జూటా మనిషి అని... బీజేపీ జూటా పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడం లేదన్నది నిజమే... కానీ ఆ డబ్బులు ఇచ్చేదెవరూ...? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. నేరుగా ఉపాధి కూలీల డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడతాయని... రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపుతుందని నిలదీశారు. ఉపాధి హామీ పనుల నిధులపై చర్చకు సిద్ధమా..? అని మంత్రి సవాల్ విసిరారు. బండి సంజయ్వి అబద్దపు మాటలన్నారు. బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై బండి సంజయ్కు అవగాహన లేదన్నారు. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా తెలంగాణలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.