DGP Mahender Reddy: Cablebridge రక్షణ కోసం 67 సీసీ కెమెరాల ఏర్పాటు
ABN, First Publish Date - 2022-05-03T01:52:12+05:30
హైదరాబాద్ కు తలమానికం అయిన దుర్గం చెరువు Cablebridge రక్షణ కోసం 67CCTV cameras ఏర్పాటు చేశామని DGP Mahender Reddy తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్కు తలమానికం అయిన దుర్గం చెరువు Cablebridge రక్షణ కోసం 67CCTV cameras ఏర్పాటు చేశామని DGP Mahender Reddy తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు చెప్పారు.ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు రహేజా గ్రూప్ సహాయ సహకారాలు అందించిందన్నారు. దుర్గం చెరువుకు వచ్చే సందర్శకుల రక్షణ కోసం ఈ ఏర్పాట్లు చేశామన్నారు.అలాగే లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దుర్గంచెరువు గస్తీ కోసం, ఎలక్ట్రికల్ వెహికల్స్, బోటింగ్ ఏర్పాటు చేశామన్నారు.దుర్గం చెరువు సందర్శకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.సైబరాబాద్ సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉందన్నారు.తెలంగాణలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.ఐటీ ఏరియాల్లో రక్షణ చాలా బాగా ఉంది దీంతో అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు. ప్రజల రక్షణ బాధ్యత పోలీస్ వ్యవస్థదని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు.