Mahabubabad: మంత్రి హరీష్రావు పర్యటనలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-05-10T16:42:51+05:30
మంత్రి హరీష్ రావు (Harish Rao) మహబూబాబాద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మహబూబాబాద్: మంత్రి హరీష్ రావు (Harish Rao) మహబూబాబాద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాబునాయక్, సంక్రీయా తండా గిరిజన రైతుల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. స్టేషన్కు రావాలంటూ పోలీసులు వారికి హుకుం జారీ చేశారు. తమను అరెస్ట్ చేయవద్ద అంటూ గిరిజన రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో 9 మంది గిరిజన రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయకపోతే మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకొని తీరుతామని మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు స్పష్టం చేశారు.