సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట?: నడ్డాను ఉద్దేశించి కేటీఆర్
ABN, First Publish Date - 2022-05-07T17:45:24+05:30
ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి..
హైదరాబాద్ : ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్ చేసిన కేటీఆర్... తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా చేశారు. రూ.2500 కోట్లు కావాలన్నారని మీ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారన్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లు చెబుతున్నారన్నారు. 30 శాతం కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు చెబుతున్నారని.. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని నడ్డాను ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Updated Date - 2022-05-07T17:45:24+05:30 IST