ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మే 28‌న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతా: కేఏ పాల్

ABN, First Publish Date - 2022-05-03T23:06:12+05:30

మే 28‌న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతా: కేఏ పాల్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: మే 28‌న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతానని కేఏ పాల్ వెల్లడించారు. కవితను అరవింద్ ఓడించినట్లు కేసీఆర్, కేటీఆర్‌ను కూడా ప్రజలు ఓడిస్తారని చెప్పారు. కేసీఆర్ హిట్లర్‌లాగా ప్రవరిస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 10 యుద్ధాలు ఆపానని, కోదండరాంను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆలోచించి చెపుతానని కోదండరాం చెప్పినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నానని చెప్పారు. మళ్ళీ తాను సిరిసిల్ల వెళ్తానని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణను చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. కేసీఆర్‌కు తాను గతంలో సపోర్ట్ చేశాననన్నారు. తెలంగాణలో మార్పు రావాలని, కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్, చిన్నజీయర్ స్వామి ఎందుకు వదిలేశారో తెలియాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్ పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని కేఏ పాల్ తెలిపారు. పీకే జాతీయ పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ పది వేల కోట్లు ఇస్తాడని పీకే తనతో చెప్పారని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కేఏ పాల్ పేర్కొన్నారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!