Hyd: ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు
ABN, First Publish Date - 2022-05-04T17:34:24+05:30
హైదరాబాద్: అమీర్ పేట్లోని ప్రజా శాంతి పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామ కొనసాగుతోంది.
Hyderabad: అమీర్ పేట్లోని ప్రజా శాంతి పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామ కొనసాగుతోంది. పార్టీ ఆఫీసుకు మళ్లీ పోలీసులు వచ్చారు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళేందుకు కేఏ పాల్కు అనుమతి లేదని, ఒకవేళ డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు.
కాగా డీజీపీ కార్యాలయానికి బయలుదేరడానికి కేఏ పాల్ సిద్దమయ్యారు. మూడు రోజుల క్రితం తనపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ, సీఐలపై డీజీపీకి పిర్యాదు చేస్తామన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ లేకపోవడంతో వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ డీజీపీ కార్యాలయానికి వెళ్తామని కేఏ పాల్ వర్గీయిలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు.