ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బీరు సీసాతో పొడిచి వ్యక్తి హత్య

ABN, First Publish Date - 2022-05-11T18:02:59+05:30

మద్యం మత్తులో మాట మాట పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జిర్రా షాపిబ్రిహిల్స్‌ ప్రాంతానికి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మద్యం మత్తులో మాట మాట పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జిర్రా షాపిబ్రిహిల్స్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ చింటూ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు 2020లో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. బంజారాహిల్స్‌ ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన మహ్మద్‌ అమేర్‌ (22)కూడా దొంగతనం కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. వీరిద్దరికీ జైలులో పరిచయమైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. చిల్లర దొంగతనాలు చేయడం, మద్యం సేవించడం, గొడవపడి కొట్టుకోవడం వీరికి నిత్యకృత్యమైంది. సోమవారం ఇద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బీరు తాగారు. అనంతరం జరిగిన గొడవలో అమేర్‌ బీరు సీసాతో ఒమర్‌ ముఖం, కడుపు, మెడపై పొడిచి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతుడి తల్లి జకీరాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!