హైదరాబాదీలకు Good News.. ఇక అర్ధరాత్రి తర్వాత..
ABN, First Publish Date - 2022-05-08T19:43:12+05:30
హైదరాబాదీలకు Good News.. ఇక అర్ధరాత్రి తర్వాత..
- నైట్ రైడర్స్ పేరుతో సర్వీసులు
హైదరాబాద్ సిటీ : నైట్ రైడర్స్ పేరుతో ఆర్టీసీ అర్ధరాత్రి సేవలను అందుబాటులోకి తెచ్చింది. 12.15 తర్వాత 219 రూట్ (సికింద్రాబాద్ - పటాన్చెరువు)లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక ట్రిప్పులు నడుపుతోంది. ఆదరణను బట్టి మరిన్ని రూట్లలో నైట్ రైడర్స్ బస్సులు నడిపాలని ఆర్టీసీ భావిస్తోంది. కాగా, బస్పాస్ వినియోగదారులు పాస్తో పాటు ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా చూపించాలని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి అన్నారు. ఐడీ కార్డు లేకపోతే టికెట్ తీసుకోవాలన్నారు. ఐడీకార్డు లేకుండా ప్రయాణించే బస్పాస్ వినియోగదారులకు రూ.500 జరిమానా విధిస్తామన్నారు.