ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

HYD : మద్యం మత్తులో కారుతో యువకుల బీభత్సం

ABN, First Publish Date - 2022-05-13T11:45:06+05:30

మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో (Car) బీభత్సం సృష్టించారు. తమ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టి గచ్చిబౌలి పోలీసులకు చిక్కారు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుడాకాలనీ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వట్టెం నిహాల్‌ (23), కొండాపూర్‌కు చెందిన లోహిత్‌(25)తో కలిసి మద్యం తాగారు. గురువారం సాయంత్రం 5.15 సమయంలో బీఎండబ్ల్యూ కారులో దూసుకువెళ్లారు. శ్రీరాంనగర్‌లోని మైహోం మంగళ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. వాహనంపై ఉన్న విజయ్‌కుమార్‌కు కుడిచేయి విరిగింది. మరో వ్యక్తి టి.సూర్యకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు వివరాలు సేకరిస్తుండగా నిహాల్‌, లోహిత్‌ వారితో వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు (Drunk and Drive) నిర్వహించగా నిహాల్‌కు 234/100, లోహిత్‌కు 501/100 వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!