ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bank : కడుపునొప్పిగా ఉందని బయటికెళ్లిన క్యాషియర్‌.. రూ. 23.53 లక్షలు మాయం.. అసలేం జరిగింది..!?

ABN, First Publish Date - 2022-05-12T16:27:15+05:30

కడుపునొప్పిగా ఉందని బయటికెళ్లిన క్యాషియర్‌.. రూ. 23.53 లక్షలు మాయం.. అసలేం జరిగింది..!?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • అతడిపై అనుమానం 
  • పోలీసులకు  ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/మన్సూరాబాద్‌ : బ్యాంక్‌లో రూ. 23.53 లక్షలు మాయమయ్యాయి. వనస్థలిపురం రైతు బజార్‌ వద్ద గల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ప్రవీణ్‌కుమార్‌ క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం 3.45 గంటలకు కడుపునొప్పిగా ఉందని, మందులు తెచ్చుకుంటానని బయటకు వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటల వరకూ తిరిగి రాలేదు. బ్యాంక్‌ సిబ్బంది ఫోన్‌ చేయగా.. స్విచ్చాఫ్‌ వచ్చింది. బ్యాంక్‌లో నగదు లెక్కించగా రూ. 23,53,378 తక్కువ వచ్చింది. ప్రవీణ్‌కుమార్‌ నగదు తీసుకొని పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు చీఫ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం రూ. 23.53 లక్షలు క్యాషియర్‌కు అప్పగించామని, అవి కనిపించడం లేదని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే.. క్యాషియర్‌ బ్యాగ్‌, నగదు తీసుకెళ్లినట్టు కన్పించలేదని, ప్రవీణ్‌కుమార్‌ ఆచూకీ లభిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!