నేడు హైదరాబాద్లో రెండోరోజు Rahul Gandhi పర్యటన
ABN, First Publish Date - 2022-05-07T13:55:17+05:30
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండోరోజు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. తాజ్ కృష్ణాలో ముఖ్య నేతలతో కలిసి
హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండోరోజు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. తాజ్ కృష్ణాలో ముఖ్య నేతలతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 12.30కి చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించనున్నారు. ఆపై సంజీవయ్య పార్క్లో దామోదర సంజీవయ్య విగ్రహానికి కాంగ్రెస్ అగ్రనేత నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా గాంధీభవన్కు చేరుకుని పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. భేటీ అనంతరం తిరిగి సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు.