Congress Party రైతులు, నిరుద్యోగులకు వ్యతిరేకం: KA Paul
ABN , First Publish Date - 2022-05-06T22:18:55+05:30 IST
కాంగ్రెస్ పార్టీ రైతులు, నిరుద్యోగులకు వ్యతిరేకమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతులు, నిరుద్యోగులకు వ్యతిరేకమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గుంటే కాంగ్రెస్ నేత రాహుల్ ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోవాలన్నారు. హుజురాబాద్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ది రాదా.? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయరా?.. ప్రపంచ శాంతి దూత వస్తే కనీస సెక్యూరిటీ లేదా.? అని పాల్ ప్రశ్నించారు.