ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్యపై గ్రీవెన్స్లో ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-05-03T00:16:28+05:30
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య డాక్టర్ సీతామహలక్మిపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య డాక్టర్ సీతామహలక్మిపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసింది కడారి లక్ష్మి అనే వృద్ధురాలు. తన భూమిని శంకర్ నాయక్ భార్య 20 లక్షలకు కొన్నారని తెలిపింది. కాని 10 లక్షలు మాత్రమే ఇచ్చిందని, మరో 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వనని శంకర్ నాయక్ భార్య బెదిరిస్తున్నారని కడారి లక్ష్మి ఆరోపణలు చేసింది. ఏడాది నుంచి డబ్బులు అడిగితే తనను తిడుతున్నారని ఆవేదనవ్యక్తం చేసింది. మధ్యవర్తి తొర్రూరు జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ కూడా ఈ విషయంలో చేతులెతేయ్యడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని గ్రీవెన్స్లో కడారి లక్ష్మి అధికారులను వేడుకుంది.