విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

ABN , First Publish Date - 2022-05-06T05:02:49+05:30 IST

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాల యంలో పదవతరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని వాటిని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, మే 5: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాల యంలో పదవతరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని వాటిని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో బీసీ సంక్షేమశాఖాధికారి సత్యనారాయరెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి సజీవన్‌, సైకియాట్రిస్టు కవిత పాల్గొన్నారు.

ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై 

     చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలోని ద్వారకామాయి గోశాలపేరుతో కబేళాలకు పశువులను తరలిస్తున్న నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న సభ్యులపై చర్యలు తీసుకో వాలని బీజేపీ, కులసంఘాల నాయకులు గురువారం అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డికి వినతిపత్రం అందజే శారు. గతనెల 26న రాత్రి ఎద్దులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థాని కులు ఆపి నిలదీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందన్నారు.ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాండ్రెవిశాల్‌, డాక్టర్‌ రమేష్‌, గణేష్‌, ప్రణయ్‌, నాగరాజు, శ్యాం, నరేష్‌, సాయి, ప్రహ్లాద్‌, శ్యాం పాల్గొన్నారు.

Read more