డ్వాక్రా భవన నిర్మాణానికి భూమి పూజ
ABN, First Publish Date - 2022-05-12T04:16:23+05:30
మండలంలోని నంనూర్ గ్రామంలో డ్వాక్రా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని డ్వాకా మహిళల కోసం రూ. 5 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
హాజీపూర్, మే 11: మండలంలోని నంనూర్ గ్రామంలో డ్వాక్రా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు బుధవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని డ్వాకా మహిళల కోసం రూ. 5 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు గతంలో ప్రభుత్వాలు తక్కువ రుణాలు ఇచ్చేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తుందని తెలిపారు. మహిళలను రుణాల సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు బేరే పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, పీఏసీఎస్చైర్మన్ వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, రైతు సమితి కన్వీనర్ శ్రీనివాసరావు, నాయకులు బాపు, శ్రీనివాస్, సత్యం , రాజయ్య పాల్గొన్నారు.