Hyd: వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2022-05-09T20:39:37+05:30
Hyderabad: నగరంలోని వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు.
Hyderabad: నగరంలోని వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో తెలంగాణ ప్రభుత్వం వాటా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకం నిధులు విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ (KCR) ప్రభుత్వం లేక్కచేయడంలేదని రైతులు ఆరోపించారు. రూ. 450 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం వాటా చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొన్నారు.