తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా
ABN , First Publish Date - 2022-05-14T04:29:53+05:30 IST
మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.
రెబ్బెన, మే 13: మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అంజనేయులుగౌడ్ మాట్లాడుతూ గోలేటి సర్పంచి గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధు లను దుర్వినియోగం చేశాడన్నారు. ఈ విషయంలో సమగ్రవిచారణ జరిపి సర్పంచ్పై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. అసెంబ్లీకన్వీనర్ సొల్లు లక్ష్మి, మండల ప్రధానకార్యదర్శి ఓదెలు, గోలేటి పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, రాజేష్, లక్ష్మయ్య, శ్రీనివాస్, నారాయణ, మల్లయ్య, మానస, లక్ష్మి పాల్గొన్నారు.