ఎంఎంటీఎస్లో ‘ఫస్ట్క్లాస్’ చార్జీలు 50% తగ్గింపు
ABN, First Publish Date - 2022-05-04T08:10:59+05:30
జంట నగరాల్లో ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసు) రైళ్లలో ఫస్ట్ క్లాస్లో సింగిల్ జర్నీ ప్రయాణికులకు చార్జీల్లో 50 శాతం తగ్గించారు.
రేపటి నుంచి అమల్లోకి
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): జంట నగరాల్లో ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసు) రైళ్లలో ఫస్ట్ క్లాస్లో సింగిల్ జర్నీ ప్రయాణికులకు చార్జీల్లో 50 శాతం తగ్గించారు. ఈ తగ్గింపును గురువారం నుంచి అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొవిడ్ లాక్డౌన్ అనంతరం ఎంఎంటీఎస్ సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు శివారు ప్రాంతాల ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఫలక్నుమా- సికింద్రాబాద్- హైదరాబాద్- బేగంపేట- లింగంపల్లి- తెల్లాపూర్- రామచంద్రాపురం మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ దాదాపు 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జంట నగరాల్లోని ప్రయాణికులు తగ్గింపు చార్జీలతో ఎంఎంటీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సూచించారు. ప్రతి ఎంఎంటీఎ్సలో 1, 2 ఫస్ట్ క్లాస్ బోగీలుప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.