IPL 2022 : హాస్పిటల్లో క్రికెటర్ Prithvi Shaw
ABN , First Publish Date - 2022-05-09T02:51:20+05:30 IST
న్యూఢిల్లీ : IPL2022లో గత మ్యాచ్ Sunrisers hyderabadపై ఆడని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ Prithvi Shaw జ్వరంతో బాధపడుతున్నాడు.
న్యూఢిల్లీ : IPL2022లో గత Sunrisers hyderabadపై మ్యాచ్ ఆడని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ Prithvi Shaw జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో హాస్పిటల్ లో చేరానని ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కోలుకుంటున్నట్టు వివరించాడు. హాస్పిటల్ లో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని అభిలాషించినవారికి కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా పృధ్వీ షా చేరిన హాస్పిటల్ కొవిడ్ కు సంబంధించినదని కాదని సమాచారం. ఆదివారం రాత్రి Chennai super kings పై జరిగిన మ్యాచ్ లో అందుబాటులో లేడు. షా అందుబాటులో లేకపోవడంతో మణ్ దీప్ సింగ్ తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తున్న విషయం తెలిసిందే.