భార్య ఆత్మహత్య చేసుకుందని ఆ భర్త ఏం చేశాడంటే.. హోటల్ రూమ్కు వెళ్లి..
ABN, First Publish Date - 2022-05-02T22:27:17+05:30
అతనికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. పిల్లలు లేరు.. భార్యతో అన్యోన్యంగా జీవిస్తున్నాడు..
అతనికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. పిల్లలు లేరు.. భార్యతో అన్యోన్యంగా జీవిస్తున్నాడు.. ఉన్నట్టుండి ఆమె వారం క్రితం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. షాక్కు గురైన భర్త అప్పట్నుంచి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.. ఎవరినీ కలిసేవాడు కాదు.. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ సాగించారు.. చివరకు ఓ హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసుకుని షాకయ్యారు.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దామోహ్కు చెందిన కమ్లేష్ పటేల్ శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు అన్వేషణ సాగించారు. నగరంలోని అన్ని ప్రాంతాలు వెతికారు. ఓ ప్రైవేట్ హోటల్కు వెళ్లి అడగ్గా.. కమ్లేష్ పేరుతో ఓ వ్యక్తి తమ హోటల్లో రూమ్ తీసుకున్నాడని సిబ్బంది చెప్పారు. ఆ రూమ్కు వెళ్లి చూడగా కమ్లేష్ ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కమ్లేష్ భార్య వారం క్రితం ఆత్మహత్య చేసుకుందని, అప్పట్నుంచి కమ్లేష్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని, భార్య లేని బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.